269 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ ను ఆదిలోనే షమీ దెబ్బ తీశాడు. ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో విండీస్ స్టార్ బ్యాట్స్ మేన్ క్రిస్ గేల్ ను అవుట్ చేశాడు. షమీ వేసిన షార్ట్ పిచ్ బాల్ ను ఆడబోయిన గేల్ కేదార్ జాదవ్ కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. మొదట్నుంచీ కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ వస్తున్నారు. భారత్ బౌలర్లు. ఐదు ఓవర్లలో కేవలం పది పరుగులు మాత్రమె ఇచ్చారు. బుమ్రా కూడా పొదుపుగా బౌలింగ్ చేస్తున్నాడు. రెండు ఓవర్లలో కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చాడు. 5 ఓవర్లకు విండీస్ జట్టు ఒక్క వికెట్ నష్టానికి 10 పరుగులు చేసింది. అంబ్రోస్ 5 పరుగులతోనూ, హాప్ ఒక్క పరుగుతోనూ క్రీజులో ఉన్నారు. అయితే, ఏడో ఓవర్లో హోప్ ను బౌల్డ్ చేశాడు. దీంతో విండీస్ కష్టాల్లో పడింది. ఏడూ ఓవర్లు ముగిసేసరికి విండీస్ జట్టు రెండు వికెట్లు కోల్పోయి 17 పరుగులు చేసింది.