ఇండియాతో తలపడనున్న తొలి వన్డే మ్యాచ్లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ టాస్ గెలిచిన అనంతరం భారత్ను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. వాంఖెడే మైదానంలో జరగనున్న ఈ మ్యాచ్లో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. రెండో వన్డే గుజరాత్లోని రాజ్కోట్లో ఈ నెల 17న, మూడో వన్డే 19న బెంగుళూరులో జరుగనుంది.
తుది జట్ల వివరాలు
భారత్: కోహ్లి (కెప్టెన్), రోహిత్, ధావన్, రాహుల్, అయ్యర్, పంత్ (కీపర్), జడేజా, శార్దుల్, కుల్దీప్, బుమ్రా, షమీ.
ఆస్ట్రేలియా: ఫించ్ (కెప్టెన్), వార్నర్, స్మిత్, లబ్షేన్, క్యారీ, అగర్, జంపా, స్టార్క్, కమిన్స్, ఆష్టన్ టర్నర్, కేన్ రిచర్డ్సన్