సమరం మొదలైంది..

Update: 2019-06-16 09:37 GMT

అమిర్ నిప్పులు చెరిగే బంతులు వేస్తున్నాడు.. భారత్ ఓపెనర్లు ఆచి, తూచి ఆడుతున్నారు. అమిర్ వేసిన మొదటి ఓవర్ లో కెఎల్ రాహుల్ పూర్తిగా జాగ్రత్తగా ఆడాడు.. మొదటి ఓవర్ మెయిడెన్. పరుగులేమి రాలేదు. రెండో ఓవర్ అలీ వేశాడు. రోహిత్ శర్మ తొలి బంతికి ఫోర్ కొట్టాడు. మొత్తమ్మీద రెండో ఓవర్ లో తొమ్మిది పరుగులు చేశాడు రోహిత్. రోహిత్ కూడా ఆచి తూచి ఆడుతున్నాడు. మూడో ఓవర్ అమిర్ బౌలింగ్ లో రోహిత్ ఒక పరుగు.. రాహుల్ ఒక పరుగు చేశారు. నాలుగో ఓవర్ లో రోహిత్ జాగ్రత్తగా ఆడాడు.  ఆలీ వేసిన ఈ ఓవర్లో బౌండరీ సాధించాడు. ఐదో ఓవర్ లో రాహుల్ అమిర్ బౌలింగ్ లో బౌండరీ సాధించాడు. నెమ్మదిగా స్కోరు బోర్డును పరుగులు పెట్టించడం ప్రారంభించారు భారత్ ఓపెనర్లు. ఐదో ఓవర్ ముగిసేసరికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 20 పరుగులు చేసింది. రాహుల్ 6  పరుగులతోనూ, రోహిత్ 14 పరుగులతోనూ kreejulO ఉన్నారు. 

Tags:    

Similar News