టీమిండియా లో శిఖర్ ధావన్ ఆటతీరు.. ఆత్మవిశ్వాసం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మామూలుగానే బౌలర్లపై విరుచుకుపడే శిఖర్.. ఐసీసీ టోర్నీ అంటే చాలు జూలు విదిల్చేస్తాడు. ఎక్కడా వెనక్కి తగ్గడు. బ్యాటింగ్ కు దిగాడా.. పరుగుల వరద ఖాయం.
అయితే, మొన్న ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్ లో శతకం బాదేశాడు. కానీ, బ్యాటింగ్ మొదలుపెట్టిన కొద్ది సేపటికే అతని వెలికి గాయం అయింది. అయినా గాయంతోనే ఆటను కొనసాగించి సెంచరీ చేశాడు. ఈ గాయం విషయంలో స్కానింగ్ చేసిన వైద్యులు వేలు లోపల చీలిక వచ్చినట్టు గుర్తించారు. కనీసం మూడు వారల విశ్రాంతి ధావన్ కు అవసరమని తేల్చేశారు. దీంతో అతడు న్యూజిలాండ్, పాక్, అఫ్గాన్ మ్యాచుల్లో ఆడే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో ధావన్ ఓ ట్వీట్ చేశాడు. డాక్టర్ రహత్ ఇందోరీ రాసిన ఓ పద్యాన్ని ట్వీట్ చేశాడు.
'రెక్కలతో ఎగరడం లేదు..
మా గుండె లోతుల్లోని నమ్మకం,
ఆత్మవిశ్వాసంతో ఎగురుతున్నాం' అంటూ ఉండే ఆ పద్యం ధావన్ అంతరంగానికి అద్దం పడుతోంది. చిన్న, చిన్న గాయాలు.. ఆటంకాలు తనకు అడ్డుకాబోవంటూ తన ఆత్మవిశ్వాశాన్ని ప్రకటించాడు. పట్టుదలలో శిఖర్ ధావన్ మించినవాడు లేడన్న సంగతి అందరికీ తెలిసిందే. అదే ఆత్మవిశ్వాసంతో త్వరగా కోలుకుని టోర్నీలో మళ్లీ తాను మెరుస్తానని చెపుతున్నట్టు ఆ ట్వీట్ ఉంది. ఇది అందరినీ ఆకట్టుకుంటోంది.
Kabhi mehek ki tarah hum gulon se udte hain...
— Shikhar Dhawan (@SDhawan25) June 12, 2019
Kabhi dhuyein ki tarah hum parbaton se udte hain...
Ye kainchiyaan humein udne se khaak rokengi...
Ke hum paron se nahin hoslon se udte hain...#DrRahatIndori Ji pic.twitter.com/h5wzU2Yl4H