కట్టుదిట్టమైన ఫీల్డింగ్.. చక్కని బంతులతో ఆసీస్ ను కట్టడి చేస్తోంది టీమిండియా. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆసీస్ ఓపెనర్లు వార్నర్, ఫించ్ లు నిలకడగా బ్యాటింగ్ చేశారు. అయితే కులదీప్ అద్భుతమైన త్రో తో 36 పరుగులు చేసి ప్రమాదకరంగా మారుతున్న ఫించ్ రనౌట్ చేశాడు. దీంతో నిలకడగా ఉన్న ఓపెనింగ్ జోడీ విడిపోయింది. వికెట్లు పడక పోయినప్పటికీ పరుగులు ఎక్కువగా ఇవ్వకుండా కట్టడి చేస్తున్నారు భారత ఆటగాళ్లు. కంగారూలు పదిహేడు ఓవర్లకి 79 పరుగులు చేశారు. వార్నర్ 33 పరుగులతోనూ, స్మిత్ 6 పరుగులతోనూ క్రీజులో ఉన్నారు.