ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్లో ఆఖరి లీగ్ మ్యాచ్లో భారత్, శ్రీలంక తలపడుతున్నాయి. కాగా శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్లో లీడ్స్ వేదికగా శనివారం స్థానిక హెడింగ్లే మైదానంలో శ్రీలంకతో తలపడుతోంది. అయితే ఇప్పటికే టాప్-4లో చోటు దక్కించుకున్న భారత్ చివరి లీగ్ మ్యాచ్ను కూడా చేజిక్కించుకునేందుకు ప్రయత్నిస్తోంది. అయితే ఈ మ్యాచ్ లో స్పల్ప మార్పులు జరిగాయి. చాహల్ ప్లేస్లో కుల్దీప్కు స్థానం దక్కింది. మహమ్మద్ షమి స్థానంలో రవీంద్ర జడేజాకు స్థానం కల్పించారు.