వైయస్ఆర్ రాజకీయ జీవితంలో భాగమైన పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కిన 'యాత్ర' చిత్రం రెండో రోజు కూడా సక్సెస్ ఫుల్ గా సాగుతోంది. డైరెక్టర్ మహీ వి రాఘవకు వైసీపీ నేతలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్రెడ్డితో యాత్ర డైరెక్టర్, నిర్మాతలు విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి భేటీ అయ్యారు. ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల ప్రజలు, వైఎస్ అభిమానులు, సినీ ప్రియుల నుంచి మంచి స్పందన వస్తోందని జగన్ కు వివరించారు. కాగా సినిమాకు వచ్చిన హిట్ టాక్ గురించి ఇంట్రెస్టింగ్ గా వైఎస్ జగన్ అడిగి తెలుసుకున్నారని, చిత్రంపై వస్తున్న ప్రేక్షకాదరణ పట్ల సంతోషం వ్యక్తం చేశారని తెలిపారు. జనాలు ఫోన్ చేసి చిత్రంపై ఫీడ్బ్యాక్ ఇస్తుంటే తనకు మాటలు రావడం లేదని ఆనందం వ్యక్తం చేశారు డైరెక్టర్ రాఘవ.వైఎస్ జగన్ను కలిసిన 'యాత్ర' టీమ్