దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ జీవితంలో జరిగిన ఘటనల ఆధారంగా 'యాత్ర' సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాను 70 ఎం.ఎం.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై విజయ్ చిల్లా, శశిదేవి రెడ్డి నిర్మించారు. మహి.వి.రాఘవ్ దర్శకుడు. ఈనెల 8న విడుదల కాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్బంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో ఒదిగిపోయిన మళయాళ మెగాస్టార్ ముమ్మట్టి మాట్లాడారు.. తాను 21 ఏళ్ల తర్వాత తెలుగులో సినిమా చేస్తున్నాను.. ఇది చాలా సంతోషంగా ఉంది. వైఎస్ఆర్ జీవితంలో చేసిన పాదయాత్ర అనే సరికి సినిమా చేయడానికి అంగీకరించాను. సినిమా ప్రారంభానికి ముందుగానే
వైయస్సార్ డైలాగ్స్ ఎలా ఉండేవో నేర్చుకున్నాను. తప్పులున్నా కరెక్ట్ చేసుకుని నటించాను. ఇది నేను నటించిన మూడో స్ట్రయిట్ తెలుగు మూవీ. ఎంతో మంది వైఎస్ఆర్ని వారి గుండెల్లో పెట్టుకుని ఉన్నారు. అలాంటి వారి గుండెల్లో నన్ను కూడా పెట్టుకోండి. ఆయన్ను ప్రేమించిన దానిలో నన్ను 1 శాతం ప్రేమిస్తే చాలు. సినిమాకు సంబంధించి మేం చేయాల్సిన పని పూర్తయ్యింది. ఇక మీరే ఈ సినిమాను హిట్ చెయ్యాలని ప్రేక్షకులకులను ఉద్దేశించి మాట్లాడారు. కాగా ఈ సినిమాలో ఆయన తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పాత్ర లేదని తెలిపారు దర్శకుడు మహి రాఘవ.ఆయన్ను ప్రేమించిన దానిలో నన్ను 1 శాతం ప్రేమిస్తే చాలు