గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలతో పూర్తి స్థాయి రాజకీయాలకి పరిమితం అయ్యారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ . ఆ ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోయినప్పటికి ప్రజల తరుపున ప్రభుత్వం పై పోరాడుతూ రాజకీయాల్లోనే కొనసాగుతున్నారు పవన్ కళ్యాణ్. అయితే అయన సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి.
బాలీవుడ్ లో మంచి హిట్టు అయిన పింక్ సినిమాని పవన్ తెలుగు రీమెక్ చేయనున్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.. ఇక ఇది ఇలా ఉంటే హీరోగా సినిమాలు చేస్తానో లేదో తెలియదు కానీ సినిమా నిర్మాణరంగంలో మాత్రం ఉంటానని పవన్ ఇప్పటికే ప్రకటించారు. సినిమాలు తప్ప తనకీ మరో వ్యాపారం తెలియదని పవన్ చెప్పుకొచ్చారు. పీకే ఎంటర్టైన్మెంట్స్ పై పవన్ ఇప్పటికే పలు చిత్రాలను కూడా నిర్మించారు కూడా . ఇక సినీ నిర్మాణంలో భాగంగా రామ్ చరణ్తో పక్కా సినిమా చేస్తానని పవన్ ఇప్పటికే ఓ ఇంటర్వ్యూలో ప్రకటించారు.
అయితే ఈ మెగా ప్రాజెక్ట్ కి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. హారిక హాసిని క్రియేషన్స్ మరియు పీకే ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించనున్నట్టు సమాచారం.. త్రివిక్రమ్ తాజాగా అల్లు అర్జున్ తో అల వైకుంఠపురములో చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్.ఆర్.ఆర్ అనే మూవీ షూటింగ్ లో ఉన్నాడు. ఈ సినిమా తర్వాత చరణ్ త్రివిక్రమ్ తో సినిమా చేయనున్నాడని తెలుస్తోంది.
ఈ క్రేజీ ప్రాజెక్ట్ త్వరలో పట్టాలెక్కలని మెగా అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. చూడాలి మరి ప్రాజెక్ట్ పట్టాలేక్కేది ఎప్పుడో..