సినీ నటుడు విశాల్, అనీశాల వివాహ నిశ్చితార్థం హైదరాబాదులో నిరాడంబరంగా జరిగింది. ఇరు కుటుంబాలకు చెందిన వ్యక్తులు, సన్నిహిత మిత్రులు మాత్రమే ఎంగేజ్ మెంట్ కార్యక్రమానికి హాజరైనట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అభిమానులు విశాల్, అనీశాకు శుభాకాంక్షలు చెప్పారు. సెప్టెంబరులో వీరి వివాహ వేడుక జరగనున్నట్లు సమాచారం.