ఎఫ్ 3 పై క్లారిటీ ఇచ్చిన హీరో
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి నటించిన ఎఫ్ 2 సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో పెద్దగా చెప్పాల్సిన పనిలేదు.
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి నటించిన ఎఫ్ 2 సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. గత ఏడాది సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా సంక్రాంతి హిట్టుగా నిలిచింది. ఈ సినిమాలో వెంకీ సరసన తమన్నా నటిస్తే, వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్ నటించింది. అయితే ఈ సినిమా మంచి హిట్టు కావడంతో ఈ సినిమాకి సీక్వెల్ ఉండబోతుందని ఎప్పటినుండో వార్తలు వస్తున్నాయి.
దీనిపైన అటు హీరోస్ కానీ దర్శకుడు అనిల్ రావిపూడి కానీ స్పందించింది లేదు. అయితే దీనిపై తాజాగా హీరో వెంకటేష్ స్పందించాడు. ఎఫ్ 2 సినిమాకు సీక్వెల్ రెడీ అవుతోందని, దీనికి సంబంధించి డిష్కషన్స్ ఇప్పటికే ఒక కొలిక్కి వచ్చినట్టుగా చెప్పాడు. అంతేకాకుండా ఈ సినిమాలో తనతో పాటు వరుణ్ తేజ్ కూడా నటిస్తాడని చెప్పుకొచ్చాడు వెంకటేష్..
సంక్రాంతికి మహేష్ బాబు, అనిల్ రావిపూడి కొత్త సినిమా 'సరిలేరు నీకెవ్వరూ' విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఎఫ్ టూ సీక్వెల్ కు ఎఫ్ త్రీ పేరును ఖరారు చేసినట్టుగా వెంకటేష్ చెప్పాడు. అయితే ఈ సీక్వెల్ లో తమన్నా, మెహ్రీన్ లకి బదులు మరో హీరోయిన్స్ నటించానున్నారట! వారు ఎవరు అన్నది తేలాల్సి ఉంది. అంతేకాకుండా ఈ సీక్వెల్ లో రవితేజ కూడా ఉంటాడని వార్తలు వస్తున్నాయి. దీనిపైన చిత్ర యూనిట్ స్పందించాల్సి ఉంది. ఈ సినిమాని దిల్ రాజు నిర్మించబోతున్నారు.