దర్శకుడు హరీష్ శంకర్ ప్రస్తుతం వాల్మీకి సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. సిద్ధార్థ్ నటించిన తమిళ సినిమా జిగర్తాండ సినిమాకి ఇది రీమేక్. అయితే ఈ సినిమాని తెలుగుకు అవసరమైన విధంగా తనదైన శైలిలో మార్పులు చేసుకున్నాడట హరీష్ శంకర్. వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్నారు.
ఈ సినిమా విషయంలో ఇప్పటివరకూ ఎటువంటి విషయాలూ బయటకు రాలేదు. కానీ, ఇపుడు హరీష్ శంకర్ ఓకే ట్వీట్ ద్వారా సినిమా ప్రీ టీజర్ ని త్వరలో విడుదల చేసి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నట్టు చెప్పారు. 14 రీల్స్ ప్లస్ బ్యానేర్ పై గోపీ ఆచంట, రామ్ ఆచంట వాల్మీకి ని నిర్మస్తున్నారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతున్నారట.