'నీ కన్ను నీలి సముద్రం' పాటకు వ్యూయర్ల 'ఉఫ్పెన'
మెగా ఫ్యామిలీ నుంచి వెండితెరకి పరిచయం అవుతున్నాడు సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్..
మెగా ఫ్యామిలీ నుంచి వెండితెరకి పరిచయం అవుతున్నాడు సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్.. వైష్ణవ్ తేజ్ ఇండస్ట్రీకి కొత్తేమికాదు.. చిరంజీవి హీరోగా నటించిన శంకర్ దాదా ఎంబీబీయస్ సినిమాలో కీలకపాత్ర పోషించాడు. ఇప్పుడు ఉప్పెన సినిమాతో పూర్తి స్థాయి హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాకి సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది..
ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన నిత్యా శెట్టి అనే కొత్తమ్మాయి హీరోయిన్ గా నటిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, ఫస్ట్ సాంగ్ సినిమా పైన మంచి అంచనాలను కలగజేశాయి. హీరో హీరోయిన్లు వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి.. ఇద్దరికీ ఇదే తొలి చిత్రమైనప్పటికీ 'నీ కన్ను నీలి సముద్రం' అనే పాట ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలిసిందే. దేవి శ్రీ ప్రసాద్ అందించిన బాణీలకు తన మధురమైన గీతాలతో జావెద్ అలీ జీవం పోశారు. శ్రీమణి, రఖీబ్ ఆలమ్ అందించిన సాహిత్యం ఈ పాటకు ప్రాణం తాజాగా 'నీ కన్ను నీలి సముద్రం' పాట మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. యూట్యూబ్లో 7 కోట్ల వ్యూస్ను దాటేసింది.