సైరాని ఆపేయాలి: హైకోర్టు మెట్లు ఎక్కిన ఉయ్యాలవాడ వంశీకులు

Update: 2019-09-23 12:05 GMT

స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా సైరా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాని సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా రామ్ చరణ్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. అక్టోబర్ రెండున గాంధీ జయంతీ సందర్బంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. నిన్న గ్రాండ్ గా ఎల్బీ స్టేడియంలో గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ ని కూడా నిర్వహిచింది చిత్ర యూనిట్ . అయితే సినిమా విషయంలో ఉయ్యాలవాడ వంశీకులు తమకి న్యాయం చేయాలనీ పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే.. అందులో భాగంగానే చిరంజీవి ఇంటి ముందు ధర్నాకి కూడా దిగారు. సైరా టీమ్ పై కేసులు కూడా పెట్టారు. ఇప్పుడు ఈ సినిమా విడుదలను ఆపేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. తమకు న్యాయం జరిగే వరకు సైరా నరసింహా రెడ్డి సినిమాను విడుదల చేయోద్దంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు. రేపు ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టనుంది హైకోర్టు.

Tags:    

Similar News