ట్విట్టర్ టాప్ టెన్ లో 'మహేష్' ఒక్కడే!
సంవత్సరాంతం వచ్చేసింది. మరో ఇరవై రోజుల్లో 2019 కి వీడ్కోలు పలకనున్నాము. కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలకడానికి సిద్ధం అవుతున్నాము.
సంవత్సరాంతం వచ్చేసింది. మరో ఇరవై రోజుల్లో 2019 కి వీడ్కోలు పలకనున్నాము. కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలకడానికి సిద్ధం అవుతున్నాము. ఈ సందర్భాల్లో ఈ సంవత్సరం అన్ని రంగాల్లో మెరుపులు మెరిపించిన విశేషాల గురించి వార్తలు వస్తున్నాయి.
సోషల్ మీడియాలో ప్రముఖంగా ఉన్న ట్విట్టర్ ఈ సంవత్సరంలో భారతదేశంలో టాప్ లో ఉన్న ట్వీట్ లను వెల్లడించింది. సినీరంగానికి సంబంధించి ట్విట్టర్ విడుదల చేసిన ట్రెండింగ్ జాబితాలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు టాప్ టెన్ లోచోటు దక్కించుకున్నారు.
ట్విటర్ ఇండియా 'ట్విట్టర్ టాప్ ట్రెండ్స్ 2019' పేర్లలో టాలీవుడు, బాలివుడ్, కోలీవుడ్ నుంచి చాలా మంది ప్రముఖులు స్థానాన్ని దక్కించుకున్నారు. ఇటు తెలుగు సినిమా రంగంలో టాప్ హీరోగా ఉన్న టాలీవుడ్ నటుడు మహేష్ బాబు ట్విట్టర్ టాప్ ట్రెండ్స్నూ స్థానం దక్కించుకున్నాడు. ఈ జాబితాలో తొమ్మిదో స్థానంలో నిలిచి తన జోరును ప్రదర్శించారు. ట్విట్టర్ ప్రకటించిన ఈ జాబితాలో టాలీవుడ్ నుంచి టాప్ టెన్ లో స్థానం పొందింది మహేష్ బాబే కావడం విశేషం.
ఇక ఈ జాబితాలో ఎప్పటిలా మొదటి స్థానాన్ని బిగ్ బీ అమితాబ్ దక్కించుకున్నారు. తరువాతి స్థానాల్లో వరుసగా అక్షయ్, సల్మాన్ లు నిలిచారు. దక్షిణాది నుంచి బిగిల్ నిర్మాత అర్చన కలాపతి నాలుగో స్థానంలో నిలవగా, ఆ సినిమా హీరో విజయ్ ఐదో స్థానంలో ఉన్నారు. కోలీవుడ్ సినీ దర్శకుడు అట్లీ పదవ స్థానం దక్కించుకున్నాడు.
అదేవిధంగా మహిళల విభాగంలో హీరోయిన్ల జాబితాలో కాజల్ అగర్వాల్ ఏడో స్థానంలో, రకుల్ ప్రీత్ సింగ్లు పదో స్థానంలో ఉన్నారు. ఇక బాలీవుడ్ నటీమణులు సోనాక్షి సిన్హా అగ్రస్థానంలో ఉండగా, అనుష్క శర్మ రెండో స్థానాన్ని దక్కించుకున్నారు.