Fathers Day 2020: గోపీచంద్ పిల్లలతో సరదాగా..

Update: 2020-06-21 11:52 GMT
Gopi Chand (Twitter Photo)

ఒక్కరోజు స్మరణతో పోయే బంధం కాదది. ఒకే రోజు తలుచుకుని చెప్పుకునే అనుబంధం కాదది. ఊపిరి తీసుకున్న క్షణం నుంచి.. జీవితపు చివరి అంచుల వరకూ అన్నిదశాల్లోనూ ప్రభావితం చేసే శక్తి అది. నాన్న.. రెండక్షరాలు.. కానీ ఆ శబ్దం ఇచ్చే అనుభూతి ప్రతి తండ్రికి ఓ మధురస్మృతి. ప్రతి తయునికి జీవిత కాలపు పెన్నిధి. తన జీవితాన్ని త్యాగం చేసే ప్రతి కొడుకు, కూతురు జీవితంలో నాన్న పాత్ర మరువలేనిది. మహనీయమైనది నాన్న ఎప్పుడూ పిల్లల గుండెల్లో ఉంటాడు. అదే మనం నాన్నకు ఇచ్చే గౌరవం. పిల్లలను ఎవరినైనా మీ ఇంట్లో నీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం అని అడిగితే చాలా మంది పిల్లల నుంచి వచ్చే సమాధానం ఎంటో తెలుసా? నాకు మానాన్న అంటే చాలా ఇష్టం అని చెపుతారు. మరికొంత మంది నాకు మా అమ్మ అంటే ఇష్టం అని చెపుతుంటారు.

ఫాదర్స్ డే సందర్బంగా తండ్రితో తన బంధాన్ని తెలుపుతూ ఆసక్తికర ట్వీట్ చేశారు గోపీచంద్. గోపిచంద్ లాంటి స్టార్లు రేర్ గా మాత్రమే ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్ని సోషల్ మీడియాల్లో రివీల్ చేస్తుంటారు. "ఒక తండ్రిగా అత్యుత్తమ భావనతో ఉన్నాను. మా పిల్లల్ని చూస్తుంటే దేవుని ఆశీస్సులతో సంపూర్ణత సాధించినట్టే అనిపిస్తోంది. మై లవ్ లీ లిటిల్ వన్స్.. నాకు బలంగా నిలిచినందుకు థాంక్యూ"అంటూ కాస్త ఎమోషనల్ గా ట్వీట్ చేసారు. గోపీచంద్ అభిమాని తన కుమారుడిని విరాట్ కృష్ణని ఆయన తండ్రి గారైన టి.కృష్ణ గారితో.. అలాగే రెండవ కుమారుడు వియాన్ ని ప్రేమ్ చంద్ గారు అంటూ పోల్చడం విశేషం.

ప్రస్తుతం సంపత్‌ నంది దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నాడు. శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ ని రిలీజ్ చేశారు. ముందునుంచి అనుకున్తునట్టుగానే 'సీటీమార్‌'అనే టైటిల్‌నే ఈ సినిమాకి ఫిక్స్‌ చేశారు. కబడ్డీ ఆట నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుందని సినిమా పోస్టర్ ని చూస్తేనే అర్ధం అవుతుంది. 




 


Tags:    

Similar News