కరోనా ఎఫెక్ట్ : నితిన్ పెళ్లి వాయిదా
కరోనా నేపధ్యంలో ఇప్పటికే చాలా వాయిదా పడ్డాయి. ఇప్పుడు యంగ్ హీరో నితిన్ పెళ్లి కూడా వాయిదా పడింది.
కరోనా నేపధ్యంలో ఇప్పటికే చాలా వాయిదా పడ్డాయి. ఇప్పుడు యంగ్ హీరో నితిన్ పెళ్లి కూడా వాయిదా పడింది. గత కొద్ది రోజుల కింద హీరో నితిన్ కి డాక్టర్ సంపత్ కుమార్, నూర్జహాన్ కుమార్తె షాలినితో నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే.. ఇక వీరి పెళ్లిని ఏప్రిల్ 15న పెళ్లి, 16న దుబాయ్లోని వెర్సేస్ పాలాజ్జో లగ్జరీ హోటల్లో నిర్వహించాలని అనుకున్నారు. కానీ దేశంలో రోజురోజుకి కరోనా వైరస్ విస్తరించడంతో పెళ్లి జరగడం పెద్ద సమస్యగా మారింది. ఈ నేపధ్యంలో తన పెళ్లిని వాయిదా వేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ను పోస్ట్ చేశారు. అంతేకాకుండా మార్చి 30వ తేదీ తన పుట్టినరోజును జరుపుకోకూడదని నిర్ణయించుకున్నట్లు నితిన్ వెల్లడించారు.
"నా అభిమానులకు, తెలుగు ప్రజలకు నమస్కారం. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతూ ఎలాంటి ఆందోళనకర పరిస్థితులు ఏర్పడివున్నాయో మీకు తెలుసు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎవరూ బయటకు రాకూడదని, లాక్డౌన్ కాలంలో మార్చి 30వ తేదీ నా పుట్టినరోజును జరుపుకోకూడదని నిర్ణయించుకున్నాను. అందువల్ల ఎక్కడా కూడా నా పుట్టినరోజు వేడుకలు జరుపవద్దని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. అంతే కాదు, లాక్డౌన్ నేపథ్యంలో ఏప్రిల్ 16వ తేదీ జరగాల్సిన నా పెళ్లిని కూడా వాయిదా వేసుకుంటున్నాను. ఇప్పుడు మనమందరం కరోనా వ్యాప్తిని అరికట్టడానికి కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది.
ఈ సంక్షోభ సమయంలో మన ఇళ్లల్లో మనం కాలు మీద కాలేసుకొని కూర్చొని, మన కుటుంబంతో గడుపుతూ బయటకు రాకుండా ఉండటమే దేశానికి సేవ చేసినట్లు. ఎల్లవేళలా మీ అభిమానంతో పాటు మీ ఆరోగ్యాన్నీ ఆశించే మీ.. నితిన్ " అంటూ నితిన్ పేర్కొన్నాడు. ఇక తాజాగా భీష్మ సినిమాతో మంచి హిట్ కొట్టిన నితిన్ ఆ తర్వాత విభిన్నమైన కథలను తెరకెక్కించే చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఓ సినిమాని, తొలిప్రేమ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దే చిత్రంలో నటిస్తున్నాడు. రంగ్ దే చిత్రంలో నితిన్ కి జోడిగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఇక కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ సినిమాని చేసేందుకు పిక్స్ అయ్యాడు నితిన్..