ప్రముఖ సినీ గేయ రచయిత శివ గణేశ్ కన్నుమూశారు. గురువారం వనస్థలిపురంలోని తన నివాసంలో గుండెపోటుతో మరణించారు. తెలుగులో డబ్బింగ్ చిత్రాలుగా రిలీజ్ అయి ఘనవిజయం సాధించిన ప్రేమికుల రోజు, నర్సింహా, జీన్స్, ఒకే ఒక్కడు, బాయ్స్, ఎంతవారు కాని, 7జీ బృందావన్ కాలనీ లాంటి సినిమాలకు ఆయన సాహిత్యమందించారు. వెయ్యికి పైగా చిత్రాలకి ఆయన పాటలు రాశారు. ఆయనకి భార్య నాగేంద్రమణి .. సుహాస్ , మానస్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. శివగణేష్ ఆకస్మిక మృతితో టాలీవుడ్ దిగ్భ్రాంతికి గురైంది. ఆయన మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.