మిల్కీ బ్యూటీ తమన్నా.. సౌత్ లో ఒక రేంజ్ లో ఉన్న హీరోయిన్. సాధారణంగా మనకి హీరోయిన్లు ముంబాయి నుంచి దిగుమతి అయ్యి.. ఇక్కడ జెండా పాతి ఆ ఇమేజి తో బాలీవుడ్ లో పాగా వేయడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. చాలా మంది అలా చేశారు. కొందరు సక్సెస్ అయ్యారు. మరి కొందరు గోడకు కొట్టిన బంతిలా వెనక్కు వచ్చి ఇక్కడే తిప్పలు పడుతుంటారు. ఇప్పుడు తమన్నా కూడా బాలీవుడ్ లో పాగా వేయాలని విపరీతంగా ప్రయత్నిస్తోంది.
అందుకోసమే ఇటీవల ముంబాయి లో ఓ ఫ్లాట్ కొనుక్కుంది. ముంబాయిలోని వెర్సోవా ప్రాంతంలో చదరపు అడుగును రూ.80,778 చొప్పున 2,055 చదరపు అడగుల విస్తీర్ణంతో కూడిన ఈ ఫ్లాట్ను రూ.16.6 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే, సోషల్ మీడియా పుణ్యమా అని ఈ ఫ్లాట్ వ్యవహారం రచ్చ అయింది. బాలీవుడ్ లో సెటిల్ అవ్వాలనే తొందరలో తమన్నా రెట్టింపు ధరకు ముంబాయి లో ఫ్లాట్ కోనేసిందట. అంటూ ఒకటే హడావుడి మొదలైపోయింది.
ఇక నెటిజన్లు ఈ విషయంలో రకరకాల వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. దీంతో తమన్నా ను ఈ విషయం పై అందరూ తెగ ప్రశ్నిస్తున్నారట. అంత డబ్బు పోసి అలా ఎలా కోనేశావంటూ నిలదీస్తున్నారట. ఈ విషయాన్ని నటి తమన్నానే స్వయంగా వెల్లడించింది. తన ఫ్లాట్ గురించి ఎంత చర్చ జరుగుతుండటం ఆశ్చర్యంగా ఉందని అంది. తాను రెంట్టింపు ధర చెల్లించి ఫ్లాట్ ఎందుకు కొంటానని ప్రశ్నించింది. అలా చేయడానికి నేనేమన్నా అమాయకురాలినా అంటోంది తమన్నా. తాను ముంబాయిలో ఫ్లాట్ కొనుగోలు చేసిన విషయం నిజమేనని, అయితే రెట్టింపు ధరను మాత్రం చెల్లించలేదని వివరించింది. ఆ ఫ్లాట్ పూర్తయిన తరువాత తన తల్లిదండ్రులతో కలిసి అందులో నివాసం ఉండనున్నట్లు తమన్నా తెలిపింది. ఈ అమ్మడు 2055 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఈ ఫ్లాట్ను సమీర్ బోజ్వాణి అనే వ్యక్తి నుంచి రూ.16.6 కోట్లకు కొనుగోలు చేసినట్టు స్పష్టత ఇచ్చి ప్రచారానికి అడ్డుకట్ట వేసింది. కాగా ప్రస్తుతం ఈ అమ్మడు కోలీవుడ్లో విశాల్కు జంటగా ఒక చిత్రంలోనూ, హిందిలో ఒక చిత్రం చేస్తోంది.