సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ : మెగా హీరోలంతా ఒకే వేదికపై ....

Update: 2019-09-22 13:30 GMT

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం సైరా నరసింహరెడ్డి... సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ప్రారంభం అయింది. ఈ వేడుకకి అభిమానులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. అయితే ఈ వేడుకకి మెగా హీరోలు మొత్తం హాజరు కానున్నారు . మెగాస్టార్ చిరంజీవి నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగాబ్రదర్ నాగబాబు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్, కళ్యాణ్ దేవ్‌, మెగా డాటర్ నిహారిక హాజరు కానున్నారు. మెగా ఫ్యామిలీ మాత్రమే కాకుండా దర్శకులు వి వి వినాయక్, రాజమౌళి, కొరటాల శివ హాజరు కానున్నారు. 

Tags:    

Similar News