'మెగా' ఆఫర్ కొట్టేసిన 'సాహో' డైరెక్టర్ !

యువీ క్రియేషన్స్ నిర్మించిన రన్ రాజా రన్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు సుజీత్.

Update: 2020-04-10 13:58 GMT
Director Sujeeth, Megastar chiranjeevi

యువీ క్రియేషన్స్ నిర్మించిన రన్ రాజా రన్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు సుజీత్.. మొదటి సినిమాతో మంచి హిట్ కొట్టిన సుజీత్ రెండో సినిమానే స్టార్ హీరో ప్రభాస్ ని డైరెక్ట్ చేసే కొట్టేశాడు.ప్రభాస్ తో పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్ తో సాహో సినిమాని తెరకెక్కించాడు సుజీత్.. ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నప్పటికీ డైరెక్టర్ గా సుజీత్ కి మంచి మార్కులే పడ్డాయి. ఇక ఇది ఇలా ఉంటే తన మూడో సినిమాని మెగాస్టార్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు సుజీత్..

మలయాళం సినిమా 'లూసిఫర్'ను తెలుగులో తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన రీమేక్ హక్కులను సైతం రామ్ చరణ్ సొంతం చేసుకున్నారు.

ప్రస్తుతం సుజీత్ రీమేక్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నారు. త్వరలో ఈ సినిమాకి సంబంధించి అధికార ప్రకటన వెలువడనుంది. ఇక ఈ సినిమాని మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించారు. మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించాడు. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కి భారీ విజయాన్ని అందుకుంది.

ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య అనే సినిమాలో నటిస్తున్నాడు. పక్కా సోషల్ మెసేజ్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇందులో చిరు సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది.

ఇది చిరంజీవికి 152వ సినిమా.. ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, కొణిదెల ప్రొడక్షన్స్ కలిసి నిర్మిస్తున్నాయి.ఈ సినిమాలో రెజీనా ఒక ప్రత్యేక పాటలో కనిపించనుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని దసరా సందర్భంగా విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. ప్రస్తుతం కరోనా ప్రభావం వలన సినిమా వాయిదా పడింది.

Tags:    

Similar News