ఫైనల్ గా శ్రుతి హసన్ నే ఫిక్స్ చేసారట ..!

Update: 2019-06-14 12:34 GMT

తెలుగు సినిమాలకు శ్రుతి హసన్ దూరం అయి చాలా రోజులు అయింది .. అ తర్వాత ఆమె బాలీవుడ్ లో సినిమాలు చేసి నిలదొక్కుకునే ప్రయత్నం చేసింది కానీ అక్కడ కూడా పరాజయాలు ఆమెకి తప్పలేదు .. అయితే ఇప్పుడు ఆమె మళ్ళీ తెలుగు సినిమాల పైన ఫోకస్ చేసింది . అందులో భాగంగానే ఆమె ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం.. రవితేజ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా రూపొందనుంది. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం శ్రుతి హాసన్ ను సంప్రదించారు. అయితే ఆమె భారీ పారితోషికాన్ని  డిమాండ్ చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఇక ఫైనల్ గా ఆమెనే ఫిక్స్ చేసారట దర్శక నిర్మాతలు .. గతంలో వీరి కలయికలో బలుపు అనే సినిమా తెరకెక్కింది .. ఠాగూర్ మధు నిర్మిస్తున్న ఈ సినిమా, త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. 

Tags:    

Similar News