శ్రీదేవిది సహజమరణం కాదు..మాజీ డీజీజీ

Update: 2019-07-13 02:24 GMT

నటి శ్రీదేవి మరణం పై కేరళ జైళ్ల శాఖ మాజీ డీజీపీ రిషిరాజ్‌ సింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమెది సహజ మరణం కాదనీ..ఆమెను చంపెశారనీ అయన ఒక దినపత్రిక లో రాసిన వ్యాసంలో పేర్కొన్నారు. దేవి చనిపోలేదని, ఆమెను చంపేశారని, ఆమె మరణం వెనక కుట్ర కోణం దాగి ఉందని అన్న అయన, ఫోరెన్సిక్ నిపుణుడైన తన స్నేహితుడు ఉమా దత్తన్ తనతో ఆ విషయం పంచుకున్నారని తెలిపారు. ఓ మనిషి ఎంత మద్యం తీసుకున్నా, ఎంతగా మత్తులో మునిగి తేలినా అడుగు లోతు ఉండే నీటి తొట్టెలో పడి చనిపోవడం అసాధ్యమన్నారు. శ్రీదేవి కాళ్లను ఒకరు గట్టిగా పట్టుకుంటే మరొకరు ఆమె తలను నీటిలో ముంచి చంపేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. అలా జరిగి ఉంటే తప్ప శ్రీదేవి చనిపోయే అవకాశం లేదని ఉమా దత్తన్ తనతో చెప్పారని, దురదృష్టవశాత్తు ప్రస్తుతం ఆయన మన మధ్య లేరని ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా, ఈ విషయం పై శ్రీదేవి భర్త బోనీకపూర్ కొట్టి పాడేశారు. ఇవన్నీ ఊహాజనితమేనని కొట్టిపడేశారు. ఆధారాలు లేని ఇటువంటి వార్తలకు స్పందించాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు. ఇటువంటి మూర్ఖపు వాదనలను ఎవరో ఒకరు చేస్తూనే ఉంటారని తీసిపడేశారు.

Tags:    

Similar News