పాటగాడు మాటలు రాస్తున్నాడు!

Update: 2019-06-08 16:46 GMT

దేవీ శ్రీ ప్రసాద్.. సంగీత దర్శకుల్లో ప్రస్తుతం టాప్ పొజిషన్ లో ఉన్నారు. టాప్ స్టార్లు అందరూ దేవీనే తమ మొదటి చాయిస్ గా చెబుతారు. దేవీ సోదరుడు సాగర్ గాయకుడిగా టాప్ లో ఉన్నాడు. ఇపుడు ఈ గాయకుడు మాటల రచయితగా మారుతున్నాడు. ఈ విషయాన్ని దేవి శ్రీ ప్రసాద్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. 

సింగర్‌గా ఉన్న తన సోదరుడు 'రాక్షసుడు' చిత్రంతో మాటల రచయితగా మారాడని.. ఈ విషయాన్ని పంచుకోవడం తనకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. తమ తండ్రి (రచయిత సత్యమూర్తి) వారసత్వాన్ని కొనసాగించేందుకు అందరి ఆశీస్సులు కావాలని ట్విటర్‌ వేదికగా కోరారు. బెల్లంకొండ శ్రీనివాస్‌, అనుపమా పరమేశ్వరణ్‌ కాంబోలో తమిళ సూపర్‌హిట్‌ రాక్షసన్‌కు రీమేక్‌గా 'రాక్షసుడు' చిత్రం తెరకెక్కుతోంది.




Tags:    

Similar News