బిగ్ బాస్ షో చూసి ఓటు వేయండి : గీతామాధురి

Update: 2019-10-30 13:45 GMT

బిగ్ బాస్ 3 చివరి దశకు చేరుకుంది. మొత్తం అయిదుగురు మాత్రమే ఇప్పుడు హౌస్ లో ఉన్నారు. అందులో ఎవరు బిగ్ బాస్ 3 విన్నర్ అవుతారు అన్నది అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది. ఎవరి ఫ్యాన్స్ వారిని విజేతగా చూడాలని చాలానే శ్రమిస్తున్నారు. సోషల్ మీడియాలో కుడా చాలా పోస్ట్లు పెడుతున్నారు. ఈ నేపధ్యంలో బిగ్ బాస్ సీజన్ 2 కి రన్నరప్ గా నిలిచిన సింగర్ గీతామాధురి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. ఇందులో గీతా మాధురి బిగ్ బాస్ హౌస్ లో ఉన్న అందరికి అల్ ది బెస్ట్ చెబుతూ పోస్ట్ చేసింది. షో చూసి మీకు నచ్చిన వారికీ ఓటు వేయండి అంటూ అందులో పేర్కొంది గీతా మాధురి.



Tags:    

Similar News