మంచు లక్ష్మి 'ఫీట్ అప్ విత్ ది స్టార్స్' అనే ప్రోగ్రాంకి వాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ షో పుణ్యమా అని సినిమా సెలబ్రేటిల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుస్తున్నాయి. అందులో భాగంగానే ప్రముఖ హీరోయిన్ శ్రుతిహసన్ ఈ మధ్య ఈ షోలో పాల్గొన్నారు. ఇందులో ఆమె కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
నీకు విస్కీ అంటే పిచ్చి కదా .. మనం మొదటిసారి కలిసి ఓ రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు నువ్వు విస్కీ ఆర్డర్ చేసావ్.. మళ్ళీ ఎందుకు ఆపేసావ్ అని మంచు లక్ష్మి అడగగా దానికి శ్రుతి స్పందిస్తూ " అవును నాకు విస్కీ అంటే పిచ్చి... కానీ తాగడం వల్ల కొంచం అనారోగ్యానికి గురయ్యాను. అందుకే బ్రేక్ ఇచ్చాను. ఇది ఇంతవరకు ఎవరికి చెప్పలేదు. ఎందుకంటే ఇది నా పర్సనల్ మ్యాటర్ అని చెప్పుకొచ్చింది శ్రుతి..
పనిలో పనిగా పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లో ఎవరిని పెళ్లి చేసుకోడానికి ఇష్టపడతావు అని మంచు లక్ష్మి ప్రశ్నించగా నేను వారిని పెళ్లి చేసుకోలేను, ఎందుకంటే వారికీ ఆల్రెడీ పెళ్లి అయిపొయిందని చాలా కూల్ గా చెప్పుకొచ్చింది శ్రుతి..
It was soo much fun catching up with my debut colleague, my darling @shrutihaasan .She's fierce and she's fearless, a bundle of talent! Come catch us live and her being candid only in #feetupwiththestars @voot !
— Lakshmi Manchu (@LakshmiManchu) October 5, 2019
Screening on Voot, Monday onwards. pic.twitter.com/0S75tZAmgU