ఇవాళ 'మా' ఎన్నికలు.. ఇరు ప్యానెళ్ల హామీలు ఇవే..

Update: 2019-03-10 01:19 GMT

ఇవాళ(ఆదివారం) టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ ఎన్నికలు జరగనున్నాయి. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మా ఎన్నికలు జరుగనున్నాయి. సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలు పెట్టి 3 గంటల్లో ఫలితాలు ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం జనరల్ సెక్రటరీగా ఉన్న నరేష్… అధ్యక్ష పదవి కోసం శివాజీరాజాతో పోటీ పడుతున్నారు. అధ్యక్ష పదవికి శివాజీ రాజాపై నరేష్.. ఉపాధ్యక్ష పదవికి శ్రీకాంత్, రాజశేఖర్.. జనరల్ సెక్రటరీ పదవికి జీవితా రాజశేఖర్, రఘుబాబు పోటీ పడుతున్నారు. నరేష్ కి జీవితా రాజశేఖర్ దంపతులు మద్దతుగా నిలవగా.

శివాజీ రాజాకు శ్రీకాంత్ తో పాటు ఎస్వీ కృష్ణారెడ్డి , పరుచూరి వెంకటేశ్వరావు, రఘుబాబు వంటి సినీ పెద్దలు మద్దతుగా నిలిచారు. రెండు ప్యానెళ్ల మధ్య హోరాహోరీ పోరు కనిపిస్తోంది. గతంలో చేసిన కార్యక్రమాలను కొనసాగిస్తామంటూ తమను గెలిపిస్తే రూ.6 వేల పింఛన్‌తో పాటు కళాకారుల పిల్లల వివాహాలకు రూ.1,00,116 ఆర్థిక సాయం అందిస్తామని నరేశ్‌ ప్రకటించగా.. తమను గెలిపిస్తే 50 మంది నటీనటులకు 6 నెలల పాటు నిత్యావసర సరుకులు ఉచితంగా అందిస్తామని, రూ.7,500 పింఛన్‌ ఇస్తామని శివాజీరాజా హామీ ఇచ్చారు. 

Similar News