చడీ.. చప్పుడు లేకుండా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రేస్ మొదలెట్టేశాడు. ఇప్పటికే తన లుక్స్ తో సాహో సినిమా పై అంచనాలను భారీగా పెంచేసిన ప్రభాస్ ఈరోజు అభిమానులకు అనుకోని గిఫ్ట్ ఇచ్చాడు. ఎటువంటి ఆర్భాటం లేకుండా సాహో టీం కొత్త పోస్టర్ రిలీజ్ చేసేసింది. నిశ్శబ్దంగా ఉండండి.. రేస్ మొదలైంది అనే క్యాప్షన్తో అందరినీ ఆకర్షించేసింది ఈ కొత్త పోస్టర్. బైకే పై దూసుకుపోతున్న ప్రభాస్ లుక్.. పక్కనే గాలిలో ఎగురుతున్న కారు.. అదిరిపోయే లుక్ ను ఇచ్చింది. ప్రభాస్ లుక్ చాలా ప్రత్యేకంగా కనిపించింది. దీంతో అభిమానులు థ్రిల్ అయిపోతున్నారు.
దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్తో యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న 'సాహో' సినిమాకు సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ కథానాయిక. నీల్ నితిన్ ముకేష్, వెన్నెల కిశోర్, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్, అరుణ్ విజయ్, మందిరా బేడీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 15 న విడుదల కానుంది.