సాహో టీం నుంచి బయటకు వచ్చేశాం

Update: 2019-05-27 12:58 GMT

౩౦౦ కోట్ల భారీ బడ్జెట్ లో యంగ్ రెబల్ స్టార్ కథానాయకుడిగా ప్రతిష్టాత్మకంగా షూటింగ్ జరుపుకుంటున్న సాహో టీం నుంచి సంగీత దర్శకులు పక్కకు తప్పుకున్నారు. ఈ సినిమాకు సంగీత త్రయం శంకర్‌-ఎహసాన్‌-లాయ్‌ సంగీతం సమకూరుస్తున్నారు. వీరు ఇపుడు సాహో నుంచి తాము బయటకు వచ్చేసామంటూ సోక్షహ్ల మీడియాలో ప్రకటించారు. అంతే కాదు ప్రభాస్, సుజీత్, వంశీ, ప్రమోద్, శ్యాం లకు గుడ్ లాక్ అంటూ ట్వీట్ చేశారు.

కాగా ఆగస్టు 15 న విడుదల చేయాలనుకుంటున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. సంగీత దర్శకునిగా తమిళ సంగీత దర్శకుడు గిబ్రాన్ ను చిత్ర బృండంలోకి తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.  

Similar News