బాహుబలి తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమా సాహో. ఈరోజు ఈ సినిమా టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ ఇపుడు సంచలనం గా మారింది. ఈ టీజర్ పై ప్రముఖులు వరుసగా తమ అభినందనలు తెలుపుతున్నారు. తాజాగా టాలీవుడ్ అగ్రదర్శకుడు రాజమౌళి సాహో టీజర్ పై ట్విట్టర్ వేదికగా స్పందించారు. టీజర్ అదిరిపోయిందని వ్యాఖ్యానించారు.
సాహో చిత్రానికి ఎంత బడ్జెట్ అవసరమో అంత డబ్బును యూవీ క్రియేషన్స్ ఖర్చుపెట్టగా, ఆ బడ్జెట్ కు దర్శకుడు సుజీత్ న్యాయం చేశాడని రాజమౌళి వ్యాఖ్యానించారు. 'సాహో' టీజర్ చూస్తే అదిరిపోయిందని, ప్రభాస్ శక్తి ఏంటో ఇందులో తెలుస్తుందని, ఎంతో ధీరోదాత్తంగా, మరెంతో మనోహరంగా కనిపించాడని, తన డార్లింగ్ బిరుదుకు కూడా న్యాయం చేశాడని రాజమౌళి వివరించారు.
ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ ఈ సినిమాలో నటిస్తోంది.
UV justifying the budget and Sujeeth justifying his responsibility..Terrific teaser of #Saaho.. Strength of Prabhas is that he is Macho yet endearing..
— rajamouli ss (@ssrajamouli) June 13, 2019
And ofcourse a Darling..🤗 #SaahoTeaser https://t.co/F0ZT16LDj0