పుకార్లకు అడ్డూ ఆపూ ఉండదు. ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో అయితే మరీను. అకస్మాతుగా గాలిలో ఓ వార్త వచ్చి పడుతుంది. దానికి చిలవలు.. వలువలుగా మరింత మసాలాతో వైరల్ వార్తలు పుట్టుకొచ్చేస్తాయి. సరిగ్గా అలాంటిదే ఇది కూడాను. రెజీనా.. సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా టాలీవుడ్, కోలీవుడ్ లో బిజీగా ఉన్న నటి. ఆమె పై కొన్నాళ్లుగా చెన్నై లో ఓ ప్రచారం జరుగుతోంది. ''ఇప్పుడు చేతిలో ఉన్న సినిమాలు పూర్తయితే ఇక రెజీనా కొత్త సినిమాలేవీ ఒప్పుకోరు'' ఇదీ ఆ ప్రచారం. తనకి ఈ నెల 13న ఎంగేజ్మెంట్ జరిగిందనీ, అందుకే ఇక సినిమాలకు గుడ్ బై చెప్పే యోచనలో ఉందనీ ఓ తమిళ వెబ్ సైట్ పేర్కొంది. ఈ వార్త బాగానే వైరల్ అయింది. అయితే, రెజీనా సన్నిహితులు ఈ వార్తను కొట్టి పాడేశారు. వారు రెజీనా ఎంగేజ్మెంటా? ఎప్పుడు జరిగింది? అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు. ''ఈ వార్తలో ఏ మాత్రం నిజం లేదు. అసలు రెజీనాకి ఇప్పుడు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు. ప్రస్తుతం చేతినిండా సినిమాలున్నాయి'' అని కూడా స్పష్టం చేస్తున్నారు.
ఇటీవల పీవీపీ సంస్థ నిర్మించిన 'ఎవరు'లో రేజీనా నటించారు. ఆగస్ట్లో ఈ చిత్రం రిలీజ్ కానుంది. అలాగే నూతన దర్శకుడు అర్జున్ సాయి తెరకెక్కిస్తున్న 'ఉత్సవం'లో నటిస్తున్నారు. సెప్టెంబర్లో ఈ సినిమా విడుదల కానుంది. అటు తమిళంలో చేస్తున్న 'కసడ తపర' చివరి షెడ్యూల్ జరుగుతోంది. ఇది కాకుండా 'పార్టీ' అనే సినిమా తుది దశలో ఉంది. అలాగే అరవింద్ స్వామితో చేస్తున్న 'కల్లాపార్ట్' చివరి షెడ్యూల్లో ఉంది. ఇలా తెలుగు, తమిళ సినిమాలతో బిజీగా ఉన్న రెజీనా సినిమాలకు ఫుల్స్టాప్ పెట్టేస్తారనేది నమ్మదగ్గ వార్తేనంటారా?