మలయాళం రీమేక్ : బాలకృష్ణ, రానా మల్టీస్టారర్!
బాలకృష్ణ, రానా ఇప్పటికే ఎన్టీఆర్ బయోపిక్ లో కలిసి నటించిన సంగతి తెలిసిందే.. ఎన్టీఆర్ గా బాలకృష్ణ అలరిస్తే, చంద్రబాబుగా రానా ఆకట్టుకున్నాడు.
బాలకృష్ణ, రానా ఇప్పటికే ఎన్టీఆర్ బయోపిక్ లో కలిసి నటించిన సంగతి తెలిసిందే.. ఎన్టీఆర్ గా బాలకృష్ణ అలరిస్తే, చంద్రబాబుగా రానా ఆకట్టుకున్నాడు. అయితే ఇప్పడు వీరిద్దరూ ప్రధాన పాత్రలలో ఓ సినిమా తెరకేక్కుతుందని తెలుస్తోంది. మలయాళం సూపర్ హిట్ మూవీ "అయ్యప్పనుమ్ కోషియం" సినిమాని తెలుగులో రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట టాలీవుడ్ నిర్మాతలు.. సితార ఎంటర్ టైన్మెంట్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తుండగా, బి గోపాల్ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది.
మలయాళ సినిమాలో రిటైర్డ్ ఆర్మీ హవల్దార్ అయ్యప్పన్ నాయర్గా పృథ్వీరాజ్ నటించారు. బిజు మీనన్ పోలీస్ ఆఫీసర్ కొషీ కురియన్ పాత్ర పోషించారు. ఇక ఇదే సినిమాని తమిళంలోనూ రీమేక్ చేయగా, శశికుమార్, శరత్ కుమార్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అక్కడ కూడా ఈ సినిమా ఘనవిజయం సాధించింది. దీనితో ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేయాలని దర్శక నిర్మాతలు భావించారని, బాలకృష్ణ కూడా దీనికి ఆసక్తి కనబరించారని సమాచారం.. దీనిపైన త్వరలో అధికార ప్రకటన వెలువడనుంది.
ఇక బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమా కరోనా వైరస్ వల్ల వాయిదా పడింది. ఈ సినిమాలో అంజలి హీరోయిన్ గా నటిస్తోంది. ద్వారక క్రియేషన్స్ పై మిర్యాల రవీందర్ సినిమాని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక రానా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. 'అరణ్య', విరాట్ పర్వం' చిత్రాలతో పాటు, తేజ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు.