రామ్‌చరణ్‌ మమ్మల్ని మోసం చేశారు: ఉయ్యాలవాడ వంశీకుల బైఠాయింపు

Update: 2019-06-30 10:58 GMT

హీరో రామ్‌చరణ్‌ ఆఫీస్‌ ముందు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంశీకుల ఆందోళనకు దిగారు. తమ కథతో సినిమా తీస్తూ తమను మోసం చేస్తున్నారని రామ్‌చరణ్‌పై వారు మండిపడుతున్నారు. తమకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి రామ్‌చరణ్‌ మోసం చేశారని ఆరోపించారు. తమ కథతో సినిమా అని చెప్పి 7 కుటుంబాలతో సంతకాలు పెట్టించుకున్నారని వారు చెప్పారు. తమ ఇళ్ళలో షూటింగ్ చేశారనీ, తాము రామ్‌చరణ్‌ ను కలవడానికి ఆఫీసుకు వస్తే సిబ్బంది చేత గెంటించారని చెప్పారు. తమకు న్యాయం జరిగేవరకూ అక్కడనుంచి కదిలేది లేదంటూ బైఠాయించారు.  

Tags:    

Similar News