'పుష్ప'లో బాలీవుడ్ స్టార్.. బన్నీని ఢీ కొట్టేది ఎవరంటే?
అల వైకుంఠపురుములో సినిమా తర్వాత అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే..
అల వైకుంఠపురుములో సినిమా తర్వాత అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ చిత్రానికి పుష్ప అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇది అల్లు అర్జున్ కి 20 వ సినిమా కాగా సుకుమార్ తో రెండవ సినిమా.. ప్రస్తుతం కరోనా ప్రభావంతో సినిమా వాయిదా పడింది..
తాజాగా అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ ఈ సినిమాపై మంచి అంచనాలు పెంచింది. పుష్పక్ నారాయణ్గా డీగ్లామర్ లుక్ లో బన్నీ అదరగొట్టాడు. గంధపు చెక్కల స్మగ్లర్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుందని ఇందులో అల్లుఅర్జున్ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడని సమాచారం.. ఇక బన్ని సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది. విజయ్ సేతుపతి ఈ చిత్రంలో ఓ కీలక రోల్ చేస్తుండగా ఆయన పోలీస్ గా కనిపిస్తాడని సమాచారం..
పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా ఆదరణ పొందిన నటీనటులని తీసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తుంది. ఈ క్రమంలో విలన్గా సీనియర్ హీరోలు అయిన సంజయ్ దత్, సునీల్ శెట్టి లేదా జాకీ ష్రాఫ్ లలలో ఎవరినో ఒకరిని ఒప్పించి తీసుకోవాలని అనుకుంటున్నారట. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది. ఈ సినిమాని మే లో రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తుంది. ఆర్య ఆర్య 2 సినిమాల తర్వాత బన్నీ సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.