ఇస్మార్ట్ శంకర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కీలక కామెంట్స్ చేశారు. ఇన్నాళ్లూ ఆంధ్రా సినిమాలు చూశారు. ఇప్పుడు తెలంగాణ సినిమా చూడలేరా? అంటూ ప్రశ్నించారు. ఇస్మార్ట్ శంకర్ సినిమా తెలంగాణ స్లాంగ్లో ఉంది. ఎవరు చూస్తారని కొందరు అంటున్నారన్న పూరీ.. ఇన్ని రోజులూ ఆంధ్రా సినిమాలను తెలంగాణ వాళ్లు చూడలేదా?. మరి తెలంగాణ సినిమాలను ఆంధ్రా వాళ్లు ఎందుకు చూడరంటూ నవ్వుతూనే పూరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పూరి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడిలో చక్కర్లు కొడుతున్నాయి.