సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకి అదిరిపోయే బర్త్ డే గిఫ్ట్ అందించారు. నేడు ప్రిన్స్ మహేష్ పుట్టినరోజు సందర్భంగా మేజర్ అజయ్ కృష్ణ రిపోర్టింగ్ అంటూ చిత్ర యూనిట్ సరిలేరు నీకెవ్వరూ టైటిల్ సాంగ్ను విడుదల చేసింది. అజయ్కృష్ణగా ఆర్మీలుక్లో మెరిసిపోయిన మహేష్ బాబును చూసి ఫ్యాన్స్ తెగ మురిసిపోతునకనారు. మహేష్ స్టైలిష్లుక్ కాశ్మీర్ లోకేషన్కి దేవిశ్రీ మ్యూజిక్ తోడవ్వడంతో థీమ్ సాంగ్ గూస్ బమ్స్ కలిగించింది. సరిలేరు నీకెవ్వరు.. నువ్వేళ్లే రహదారికి జోహర్లు, ఎనలేని త్యాగానికి నువ్వే మారు పేరు అంటూ సాగే బ్యాగ్రౌండ్ బిట్ అభిమానులకు పిచ్చేకిస్తోంది.
ఆర్మీ లుక్లో అదరగొట్టిన మహేష్ మూవీ 2020 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్నారు. ప్రముఖ నటి విజయశాంతి ఈ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇటు ప్రిన్స్ మహేష్ బాబు పుట్టిన దినం పురస్కరించుకొని సోషల్ మీడియాలో ప్రముఖులు, అభిమానులు విషెస్తో సోషల్ మీడియా దద్దరిల్లుతోంది. అలాగే ప్రిన్స్ పుట్టిన రోజుతో పాటు పలువురు సీనిప్రముఖులు సరిలేరు నీకెవ్వరు చిత్రానికి అల్ ది బెస్ట్ చెప్పారు.