పుంజుకుంటున్న 'ప్రతిరోజూ పండగే' కలెక్షన్లు
మెగా మేనల్లుడు సాయి తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ప్రతిరోజూ పండగే’..
మెగా మేనల్లుడు సాయి తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం 'ప్రతిరోజూ పండగే' .. రాశీఖన్నా హీరోయిన్ గా నటించింది. మారుతి దర్శకత్వం వహించారు. ఈ సినిమా గత శుక్రవారం ( డిసెంబర్ 20) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పక్కా ఫ్యామిలీ కథతో తెరకెక్కిన ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ ఓపెనింగ్ కలెక్షన్స్ అనుకున్నంతగా రాలేదు. కానీ రానురాను కలెక్షన్స్ పుంజుకున్నాయి..
దాదాపుగా అన్ని థియేటర్లలన్నీ హౌస్ఫుల్ అయిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల్లో ఈ చిత్రం సుమారు రూ.5.6 కోట్ల షేర్ను వసూలు చేసిందని సమాచారం. గ్రాస్ రూ.15 కోట్ల వరకు ఉందని అంటున్నారు. మూడో రోజు కలెక్షన్లు బాగా పుంజుకున్నాయి కాబట్టి.. మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ.8 కోట్ల వరకు షేర్ రాబట్టడం ఖాయమని చెబుతున్నారు.
రెండు రాష్ట్రాలలో షేర్ వివరాలు ఇలా ఉన్నాయని విశ్లేషకుల అంచనా
♦ నైజాం - రూ. 2.45 కోట్లు
♦ సీడెడ్ - రూ. 66 లక్షలు
♦ నెల్లూరు - రూ. 24 లక్షలు
♦ కృష్ణ - రూ. 37 లక్షలు
♦ గుంటూరు - రూ. 45 లక్షలు
♦ వైజాగ్ - రూ. 62 లక్షలు
♦ తూర్పుగోదావరి - రూ. 47 లక్షలు
♦ పశ్చిమ గోదావరి - రూ. 34 లక్షలు
మొత్తం ఏపీ, తెలంగాణా షేర్ - రూ. 5.60 కోట్లు
రావు రమేష్, సత్యరాజ్ కీలకపాత్రలలో నటించారు. తమన్ సంగీతం అందించిన ఈ సినిమాని యువీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ కలిసి నిర్మించాయి.