మళ్లీ అదే పాత్రలో కనిపించనున్న ప్రకాష్ రాజ్ ..?

Update: 2019-10-10 10:18 GMT

విలక్షణమైన నటుడులో ప్రకాష్ రాజ్ ఒకరు.. ఎలాంటి పాత్రలో అయిన సరే అయన ఇట్టే మెప్పించగలడు... అయితే ప్రస్తుతం పాలిటిక్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేసిన ప్రకాష్ రాజ్ సినిమాలు తగ్గించాడనే చెప్పాలి. తాజాగా తమిళ్ మూవీ అయిన తలైవి సినిమాలో అయన ఓ కీలక పాత్రలో కనిపిస్తున్నట్లు తెలుస్తుంది. ఒక్కపటి నటి, రాజకీయ నాయకురాలు అయిన జయలలిత బయోపిక్ గా 'తలైవి' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఏఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి కీలకమైన కరుణానిధి పాత్ర కోసం ప్రకాశ్ రాజ్ తో చిత్ర యూనిట్ సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం.. గతంలో ప్రకాష్ రాజ్ 'ఇరువర్' (ఇద్దరు) సినిమాలో కరుణానిధి పాత్రలోనే నటించి మెప్పించారు. మళ్లీ ఆ పాత్రకి ఆయనైతేనే సరైనా న్యాయం చేస్తారని దర్శక నిర్మాతలు భావించి ఆయనతో సంప్రదింపులు చేసారని టాక్ .. ఇందులో జయలలితగా కంగనా రనౌత్ కనిపించనుంది. ఇక ఎంజీఆర్ పాత్ర కోసం అరవింద్ స్వామిని తీసుకున్నట్టుగా సమాచారం.. అయితే వీటిపైన అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది..

Tags:    

Similar News