ధనుష్ సినిమా పోస్టర్ రిలీజ్ .. ప్రభాస్ ఫ్యాన్స్ చివాట్లు
ఈశ్వర్ సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమకి హీరోగా పరిచయం అయిన ప్రభాస్ వర్షం, చత్రపతి, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలతో స్టార్ హీరోలలో ఒకడిగా నిలిచాడు.
ఈశ్వర్ సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమకి హీరోగా పరిచయం అయిన ప్రభాస్ వర్షం, చత్రపతి, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలతో స్టార్ హీరోలలో ఒకడిగా నిలిచాడు. ఇక బాహుబలి సినిమాతో ప్రభాస్ స్థాయి అమాంతం పెరిగింది. ఈ సినిమా తర్వాత సాహో సినిమాని చేసిన ప్రభాస్ దానిని కూడా పాన్ ఇండియా మూవీగానే రిలీజ్ చేశాడు. సినిమా టాక్ ఎలా ఉన్నప్పటికీ భారీ వసూళ్ళను సాధించి ప్రభాస్ మార్కెట్ ని మరింతగా పెంచింది. ఇప్పుడు జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నాడు ప్రభాస్.. ఈ సినిమాని కూడా సాహో సినిమాని నిర్మించిన యువీ క్రియేషన్స్ సంస్థే నిర్మిస్తోంది. పూజా హేగ్దే కథానాయకగా నటిస్తోంది!
ఈ సినిమా అనౌన్స్ తప్ప సినిమా గురించి ఏ అప్డేట్ కూడా లేకపోవడంతో ఫ్యాన్స్ నిరాశకి గురవుతున్నారు. అయితే తమిళ హీరో ధనుష్ కొత్త సినిమా 'జగమే తంత్రం' పోస్టర్ని యువీ క్రియేషన్స్ ట్విట్టర్ ద్వారా విడుదల చేసింది. దీనితో ప్రభాస్ ఫ్యాన్స్ యువీ క్రియేషన్స్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకపక్క తమ అభిమాన హీరో సినిమా అప్డేట్స్ కోసం ఎదురు చూస్తుంటే.. అది ఇవ్వాల్సిందే పోయి.. పొరుగు హీరో పోస్టర్ కావాల్సి వచ్చిందా అంటూ ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు. వరుస ట్వీట్లతో యువీ సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
— Glan😎 (@Glanprabhasfan) February 20, 2020
Nii pakkanodi cinema pai unde interest Prabhas anna movie pai undadu kada ra neeku lawde @UV_Creations pic.twitter.com/kV8neUOeqQ
— Lets Go Fnatic 🧡🖤 (@Yashwanth_VK18) February 20, 2020
జగమే తంత్రం
ధనుష్ హీరోగా తెరక్కుతున్న ఈ సినిమాకి 'పేట' ఫేం కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది ధనుష్కు 40వ చిత్రం కావడం విశేషం.. ఈ రోజు సినిమాకి సంబంధించిన మోషన్ పోస్టర్ను విడుదల చేశారు. తెల్లపంచె, చొక్కాతో తుపాకీ పట్టుకుని ధనుష్ ఈ పోస్టర్లో కనిపిస్తున్నాడు. ఉంది. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం సమకూర్చారు. ఐశ్వర్యలక్ష్మీ హీరోయిన్ గా నటిస్తోంది. సమ్మర్ స్పెషల్గా 2020 మే 1న తమిళ్, తెలుగు భాషల్లో భారీగా విడుదల చేయనున్నారు.