త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన సినిమా 'అజ్ఞాతవాసి'. కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయల్ హీరోయిన్ లుగా నటించారు. ఈ చిత్రం గత ఏడాది సంక్రాంతికి విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద తొలి రోజు మంచి కలెక్షన్స్ను సాధించినా డిజాస్టర్ సినిమాగానే మిగిలింది. బాక్సాఫీస్ వద్ద రాణించలేకపోయిన ఈ చిత్రం యూ ట్యూబ్లో మాత్రం సెన్సేషన్ను క్రియేట్ చేస్తోంది. అజ్ఞాతవాసి సినిమాను హిందీ భాషలో డబ్బింగ్ చేసి ఆ సినిమాకు ఎవడు 3 అనే టైటిల్ పెట్టారు. ఈ సినిమా యూట్యూబ్ లో 100 మిలియన్ల వ్యూస్ అందుకుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హిందీ డబ్బింగ్ సినిమాల్లో 100 మిలియన్ల వ్యూస్ అందుకున్న తొలి సినిమాగా అజ్ఞాతవాసి రికార్డు సొంతం చేసుకుంది.