దీపావళి సంబరాలు మెగా ఫ్యామిలీ ఇంట్లో చాలా వైభవంగా జరిగాయి. అన్నయ్యలు మెగాస్టార్ చిరంజీవి, నాగబాబులతో కలిసి పవన్ కళ్యాణ్ దీపావళి వేడుకలని జరుపుకున్నారు. ఈ వేడుకలో పవన్ భార్య అన్నా లెజినోవా, కుమారులు అకీరానందన్, మార్క్ శంకర్ పవనోవిచ్, కూతురు ఆద్యతో కలిసి చిరు ఇంటికి పవన్ వెళ్లారు. అక్కడ తల్లి అంజనాదేవీతో చిరు భార్య సురేఖ కూడా ఉన్నారు. అందరు కలిసి చాలా సరదాగా దీపావళి వేడుకలని జరుపుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మెగా ఫ్యామిలీని ఇలా ఒకే ఫ్రేమ్ లో చూడడంతో అభిమానులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.
Hpy hpy hpy Diwali to my dear #mega_family......love to see this ..😍😍😍 @PawanKalyan @KonidelaPro @upasanakonidela @IAmVarunTej @IamNiharikaK @IamSaiDharamTej @alluarjun @AlluSirish @sushkonidela pic.twitter.com/p4GWgOUhvw
— rajrj (@rajrj9982) October 28, 2019