దుమ్మురేపుతున్న మల్లేశం 'ఓహో జంబియా' పాట..

Update: 2019-06-19 13:45 GMT

పద్మశ్రీ అవార్డ్ గ్రహిత చితకింది మల్లేశం జీవిత కధ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం మల్లేశం .. ఇప్పటికే విడుదలైన సినిమా టిజర్ మంచి ప్రశంసలు అందుకుంటుంది .. తాజాగా సినిమాని వీక్షించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఅర్ సినిమాని కొనియాడారు .. అయితే తాజాగా విడుదలైన సినిమాలోని ఓ పాట అందరిని వీపరితంగా ఆకట్టుకుంటుంది .. 'ఓహో జాంబియా నాతోని మాట్లాడు నాంపల్లి జాంబియా' అంటూ సాగే ఈ పాటని గోరటి వెంకన్నరాసారు .. ఆయనతో పాటు ఈ పాటని  రాహుల్ సిప్లిగంజ్ కూడా  ఆలపించారు .. మార్క్ కె రాబిన్ సంగీతం అందించారు .. తెలంగాణా ప్రాంతంలో పీర్ల పండగను ఎలా జరుపుకుంటారో ఈ పాటలో చక్కగా చూపించారు .. ఈ పాటకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు .. ఈ పాటపైన మీరు కూడా ఓ లుక్కేయండి .. 

Full View

Tags:    

Similar News