నా కోరిక ఫలించింది:సినీనటుడు మోహన్ బాబు

Update: 2019-07-07 11:54 GMT

నా కోరికేమిటో స్వామి వారికి తెలుసు.. అది ఫలించింది అంటూ సినీనటుడు మంచు మోహన్‌బాబు తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. శనివారం ఉదయం ఆయన సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మోహన్‌బాబు మాట్లాడుతూ 'మంచి ముఖ్యమంత్రి, మంచి పరిపాలన, ఇక అన్నీ మంచిగానే ఉంటాయి. తిరుమల శ్రీనివాసుడి ఆలయం కూడా ఇక అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది. జగన్‌ పరిపాలనతో చాలా మార్పులు జరుగుతాయ'ని అభిప్రాయపడ్డారు. ఏడాదిన్నర తర్వాత శ్రీవారి దర్శనానికి వచ్చినట్లు చెప్పారు. మోహన్‌బాబుతో పాటు మిజోరం మాజీ గవర్నర్‌ వినోద్‌ కుమార్‌ దుగ్గల్‌ శ్రీవారిని దర్శించుకున్నారు.

కాగా, మోహన్ బాబు ఎన్నికల సమయంలో వైసీపీ లో చేరిన సంగతి తెలిసిందే. ఇటీవలి కాలంలో ఆయనకు ఫిలిం చాంబర్ అధ్యక్ష పదవిని జగన్ ఇస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే, దానికి మోహన్ బాబు పీఆర్ టీం ఖండించింది. 

Tags:    

Similar News