టికెట్ ధరలు పెరగలేదు కంగారు పడొద్దు : తలసాని

Update: 2019-05-08 05:08 GMT

హైదరాబాద్ నగరంలోని దియేటర్లలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి సినిమా టికెట్ల ధరల పెంపుపై వస్తున్న వార్తలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు . దీనిపై ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని అయన స్పష్టం చేశారు. ప్రభుత్వ అనుమతులతో సింగిల్ స్క్రీన్ థియేటర్‌లో రూ. 80 నుంచి రూ. 110లు, మల్టిఫ్లెక్స్ థియేటర్లలో రూ.138 నుండి రూ. 200ల వరకు సినిమా టికెట్ల ధరలను పెంచినట్లు పలువురు థియేటర్ల యాజమాన్యాలు చెప్పినట్లుగా వివిధ ప్రసార మాధ్యమాల్లో వస్తున్న ప్రచారాలను నమ్మవద్దని ఆయన చెప్పారు. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ సినిమా టికెట్ల ధరలను పెంచిన దాఖలాలు లేవన్నారు. మహేశ్‌ బాబు 25వ సినిమాగా రూపొందిన మహర్షిచిత్రం ఈ నెల 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది . ఈ సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకుడు దిల్ రాజు నిర్మాత .. 

Similar News