తన తదుపరి చిత్ర దర్శకులని వెల్లడించిన చిరంజీవి
రాజకీయాల నుంచి తిరిగి సినిమాల్లోకి వచ్చిన చిరంజీవి మళ్ళీ సినిమాల స్పీడ్ ని పెంచారు. ఖైది నెంబర్ 150, సైరా సినిమాలతో
రాజకీయాల నుంచి తిరిగి సినిమాల్లోకి వచ్చిన చిరంజీవి మళ్ళీ సినిమాల స్పీడ్ ని పెంచారు. ఖైది నెంబర్ 150, సైరా సినిమాలతోరాజకీయాల నుంచి తిరిగి సినిమాల్లోకి వచ్చిన చిరంజీవి మళ్ళీ సినిమాల స్పీడ్ ని పెంచారు. ఖైది నెంబర్ 150, సైరా సినిమాలతో ఇప్పటికే ప్రేక్షకులనను ఆకట్టుకున్న చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమాని చేస్తున్నాడు. ఇది చిరంజీవికి 152 సినిమా కావడం విశేషం.. ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, కొణిదెల ప్రొడక్షన్ కలిసి నిర్మిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావంతో సినిమా వాయిదా పడింది. సంక్రాంతికి సినిమాని విడుదల చేసే ఆలోచనలో ఉంది చిత్ర యూనిట్..
ఇక ఇది ఇలా ఉంటే తన తదుపరి చిత్రాన్ని చిరంజీవి పలువురు దర్శకులతో సినిమాలు చేయనున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.. అయితే దీనిపై తాజాగా స్పందించారు చిరంజీవి.. చిరంజీవి 153 వ సినిమాగా మలయాళంలో మంచి హిట్ అయిన లూసిఫర్ రీమేక్ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాని కకూడా కొణిదెల ప్రొడక్షన్ నిర్మిస్తోంది. అయితే ఈ చిత్రాన్ని సుజీత్ దర్శకత్వంలో చేయాలని అనుకుంటున్నట్లుగా చిరు వెల్లడించారు.
ఇక బాబీ, మెహర్ రమేష్ దర్శకత్వంలో ఓ సినిమాని చేసే ఆలోచన ఉన్నట్లుగా చిరు వెల్లడించారు. అంతేకాకుండా హరీష్ శంకర్, పరశురాం, సుకుమార్ లాంటి యువ దర్శకులని ఇటీవల మా ఇంట్లోనే కలవడం జరిగిందని, స్టోరీ డిస్కషన్ కూడా జరిగినట్టుగా చిరు తెలిపారు. కొరటాల సినిమా పూర్తైన తర్వాత తదుపరి ప్రాజెక్ట్ ని ఆఫీషియల్ గా అనౌన్స్ చేస్తానని చిరంజీవి వెల్లడించారు.