Megastar Chiranjeevi: చిరు-మైత్రి-బాబీ.. కాంబినేషన్ షూరూ?

మైత్రీ మూవీ మూవీ మేకర్స్ వారు వరుస పెట్టి సినిమాలను చేస్తున్నారు.. ఇక అందులో మెగా హీరోలతో ఎక్కువ సినిమాలను చేస్తుండడం విశేషం.

Update: 2020-03-19 11:07 GMT
Megastar Chiranjeevi (File Photo)

మైత్రీ మూవీ మూవీ మేకర్స్ వారు వరుస పెట్టి సినిమాలను చేస్తున్నారు.. ఇక అందులో మెగా హీరోలతో ఎక్కువ సినిమాలను చేస్తుండడం విశేషం.. ఇప్పటికే అల్లు అర్జున్ - సుకుమార్ సినిమా షూటింగ్ శేరవేగంగా జరుపుకుంటుంది. ఇంకో పక్కా మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ని లాంచ్ చేస్తూ 'ఉప్పెన' అనే సినిమాని చేస్తున్నారు. ఇది కాకుండా పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో మరో సినిమాని చేసేందుకు సిద్దం అయ్యారు. ఇప్పుడు ఇది కాక మరో మెగా హీరోతో సినిమాని చేసేందుకు సిద్దం అయ్యారు. మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా చేసుకునేందుకు మైత్రీ మూవీస్ సిద్దమైనట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాకి బాబీ దర్శకత్వం వహించనున్నారని టాలీవుడ్ లో జోరుగా ప్రచారం నడుస్తోంది.

అయితే దీనిపైన త్వరలో అధికార ప్రకటన వెలువడనుంది. అయితే అప్పట్లో మెగాస్టార్ మలయాళ చిత్రం లూసిఫర్ చిత్ర హక్కులను కొన్న విషయం తెలిసిందే.. అయితే ఇదే సినిమాని మైత్రి మూవీ మేకర్స్ చేయనున్నారని తెలుస్తోంది. దీనిపైన స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమాని చేస్తున్నారు. ఇక మెగా హీరోలతోనే కాకుండా యంగ్ హీరోలు, నాని, విజయ్ దేవరకొండతో సినిమాలని నిర్మిస్తోంది మైత్రి మేకర్స్.. ఇదే కాకుండా సూపర్ స్టార్ మహేష్ బాబు-పరుశురామ్ సినిమాను కూడా మైత్రీ మూవీస్ నిర్మిస్తుందని తెలుస్తోంది. ఒకేసారి ఇన్ని సినిమాల మీద ఫోకస్ చేయడం టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది.  

Tags:    

Similar News