మెగాహీరో సాయి ధరమ్ తేజ్ ఒక స్కూలును దత్తత తీసుకున్నారు. తాను హైదరాబాద్, మున్నిగూడలోని అక్షరాలయ పాఠశాలను దత్తత తీసుకున్నానని, రెండేళ్లుగా వందమందికిపైగా పిల్లలకు పౌష్టికాహార సంబంధమైన అవసరాల కోసం సహాయం చేస్తున్నానని తన ఇన్స్టాగ్రామ్ లో తెలిపారు. తాను రెండు సంవత్సరాలుగా 'థింక్ పీస్' సంస్థ తో కల్సి పని చేస్తున్నాననీ, ఇది తనకు ఎంతో సంతృప్తిని ఇస్తోందన్నారు. చిన్నారుల్లో వెలుగులు నింపేందుకు విరాళాలు సేకరించాలని అభిమానులను కోరారు. చిన్నారులకు సహాయం చేస్తే 'థింక్ పీస్' సంస్థతో పాటు చిన్నారులు, తాను కూడా మీకు రుణపడి ఉంటామని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నట్టు తెలిపారు. 100 మంది పిల్లలకు తాను సహాయం అందిస్తున్నానని చెప్పారు.
ఇటీవల దివ్యాంగునికి క్రీడల్లో సాయం చేసిన సాయిధరమ్ తేజ్ తాజాగా స్కూలు పిల్లలను దత్తత తీసుకోవడంపై సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో చిరంజీవి హోస్టుగా వచ్చిన 'మీలో ఎవరు కోటీశ్వరుడు' షోలో తనకు వచ్చిన డబ్బును కూడా ఈ స్కూల్ కోసమే సాయిధరమ్ ఖర్చు చేయడం గమనార్హం.
Instagramలోని ఈ పోస్ట్ని వీక్షించండిన sai tej (@jetpanja) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది