మన్మధుడు ముందే వచ్చేస్తాడా?

Update: 2019-05-14 13:28 GMT

ఇపుడు సినీ వర్గాల్లో ఇదే చర్చ నడుస్తోంది. అక్కినేని నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ కాల్సినటిస్తున్న మన్మధుడు 2 సినిమా షెడ్యూల్ ప్రకారం ఆగస్టులో విడుదల కావాల్సి ఉంది. ఆ రకంగానే షూటింగ్ జరుపుకుంటోంది. అయితే, ఇపుడు ఈ సినిమాని జూలై లోనే విడుదల చేయాలని నాగ్ భావిస్తున్నట్టు అంతా చెప్పుకుంటున్నారు. ఇటు చిరంజీవి, అటు ప్రభాస్ ల మధ్య తన సినిమా నలిగిపోవడమెందుకని నాగార్జున భావిస్తున్నట్టు టాక్. ఆగస్టులో చిరంజీవి సైరా విడుదల కాబోతోంది. దీంతో చిరంజీవి సినిమా ఉండగా మనది ఎందుకని.. తన మన్మధుడిని దసరాకి ప్లాన్ చేసుకుందామనుకున్నాడట నాగార్జున. అయితే, ప్రభాస్ సాహో దసరాకి రంగంలోకి దిగుతుందని అపుడు అసలు సేఫ్ కాదని ఫిక్స్ అయ్యాడట.అదీ కాకుండా బన్నీ, త్రివిక్రమ్ ల సినిమా కూడా దసరా బరిలో ఉంటాయని చెబుతున్నారు. అందుకని, ఇక జూలై నెలలో సినిమాని వదిలేస్తే ఏ గొడవా ఉండదని భావిస్తున్నట్టు సమాచారం. పైగా జూలై నుంచి బిగ్ బాస్ 3 లో నాగార్జున ఎంట్రీ ఇస్తాడని కూడా ఓ టాక్ నడుస్తోంది. ఎలా చూసుకున్నా మన్మధుడు జూలై లో వస్తే తనకి ఇబ్బంది ఉండదని ఫిక్స్ అయ్యాడట నాగ్. అయితే, సినిమా విడుదల తేదీ వెనక్కి జరిగితే ఫర్వాలేదు కానీ, ముందుకు జరిపితే షూటింగ్.. తర్వాతి పనులు వేగంగా చేయాల్సి వస్తుంది. ఈ వేగంలో కంటెంట్ దెబ్బతింటుందేమో అని అభిమానులు భయపడుతున్నారు. కానీ, ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్న రాహుల్ రవీందరన్ తన మొదటి సినిమా చి.ల.సౌ ను 50 రోజుల్లోనే తీసి హిట్ కొట్టిన అనుభవం ఉందని సర్దుకుంటున్నారు. 

Similar News