మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం అల వైకుంఠపురములో... పూజా హేగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. సుశాంత్, నవదీప్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. గీతా ఆర్ట్స్, హరిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాని విడుదల చేయనున్నారు.
అయితే తాజాగా ఈ సినిమాలోని సామజవరగమనా పాట మలయాళ వర్షెన్ విడుదల చేశారు. ఈ పాటను అక్కడ ప్రముఖ గాయకుడు యేసుదాస్ కొడుకు విజయ్ యేసుదాస్ పాడారు.. ఇప్పటికే ఈ పాట తెలుగులో విడుదలై శ్రోతలను వీపరితంగా ఆకట్టుకుంటుంది. ఎక్కువ మంది లైక్ చేసిన తొలి తెలుగు పాటగా ఈ పాట రికార్డు క్రియేట్ చేసింది. ఈ పాటను సిరివెన్నెల సీతారామశాస్త్రి రాయగా సిద్ శ్రీరామ్ ఆలపించాడు.
ఇక మలయాళంలో అల్లు అర్జున్ కి మంచి మంచి డిమాండ్ ఉంది. అక్కడ బన్నిని ముద్దుగా మల్లు అర్జున్ అని పిలిచుకుంటారు అయన అభిమానులు.. అంగు వైకుంఠపురత్తు అనే పేరుతో మలయాళంలో ఈ సినిమాని విడుదల చేయనున్నారు.