కరోనాపై సినిమా .. ఫస్ట్ లుక్ రిలీజ్
ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా వణికిస్తుంది. ఇప్పుడు ఎవరి దగ్గర చూసిన దిని గురించే చర్చ.. దీనిని అరికట్టేందుకు ప్రపంచ దేశాలు అన్ని వినూత్న ప్రయత్నాలను చేస్తున్నాయి.
ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా వణికిస్తుంది. ఇప్పుడు ఎవరి దగ్గర చూసిన దిని గురించే చర్చ.. దీనిని అరికట్టేందుకు ప్రపంచ దేశాలు అన్ని వినూత్న ప్రయత్నాలను చేస్తున్నాయి. ఇక భారత్ లో 21 రోజుల లాక్ డౌన్ విధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయినప్పటికీ కేసులు మరిన్ని పెరుగుతుండడంతో మరో 19 రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిపైన అవగాహన కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు సినిమా, క్రీడాకారులు సహాయం చేస్తున్నారు. ఇక ఇది ఇలా ఉంటే ప్రపంచాన్ని వనికిస్తున్న ఈ కరోనాపై కోలీవుడ్లో ఓ సినిమా తెరక్కెక్కుతుంది.
తాజాగా ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ కం ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. ఈ సినిమాకి 21 డేస్ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఎంబీఆర్ ఫిలిమ్స్ బ్యానరుపై ఎం విజయ్ భాస్కర్ నిర్మిస్తున్నారు. ఆయనే దర్శకత్వం కూడా వహించనున్నారు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కనుంది. లాక్ డౌన్ అనంతరం సింగిల్ షెడ్యుల్ లో సినిమాని కంప్లీట్ చేస్తామని చిత్రబృందం వెల్లడించింది. ప్రస్తుతం ఆన్లైన్ లో నటీనటుల ఎంపిక చేస్తున్నట్లు వెల్లడించారు.